ఎన్టీఆర్, మహేష్ మధ్య మళ్లీ పోటీ

మొన్నటికిమొన్న ఎన్టీఆర్, మహేష్ మధ్య బాక్సాఫీస్ పోటీ చూశాం. తారక్ నటించిన జై లవకుశ, మహేష్ చేసిన స్పైడర్ సినిమాలు షార్ట్ గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చాయి. ఈ పోటీలో ఎన్టీఆర్ గెలిచాడు. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా.. స్పైడర్ మీద జై లవకుశ చాలా బెటర్ అనిపించుకుంది.

ఈ రెండు సినిమాలు ఇప్పుడు మరోసారి పోటీపడబోతున్నాయి. వెండితెరపై వారం గ్యాప్ లో పోటీపడిన ఈ చిత్రాలు బుల్లితెరపై 24గంటల తేడాతో తలపడనున్నాయి. ఈ శనివారం జెమినీ టీవీలో జై లవకుశ ప్రసారం అవుతుంది. ఆ మరుసటి రోజు ఆదివారం జీ తెలుగులో స్పైడర్ సినిమా ప్రసారం కాబోతోంది. ఈ రెండు సినిమాల రేటింగ్స్ ఒకేసారి వస్తాయి.

బుల్లితెరపై ఎన్టీఆర్ కంటే మహేష్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అతడు నటించిన సినిమాల్ని టీవీల్లో జనాలు బాగానే చూస్తారు. అలా చూసుకుంటే బుల్లితెరపై స్పైడర్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు. కానీ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమా బుల్లితెరపై కూడా ఫ్లాప్ అయింది.

సేమ్ టైం, అటు ఎన్టీఆర్ ఈమధ్య కాలంలో టీవీ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. అతడు చేసిన బిగ్ బాస్ షో సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. అతడు నటించిన జనతాగ్యారేజ్ సినిమాకు మంచి టీఆర్పీలు వచ్చాయి. పైగా జై లవకుశలో ఎన్టీఆర్ ది త్రిపాత్రాభినయం. మొత్తానికి ఈ సంక్రాంతికి వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా రసవత్తర పోటీకి