కుమార్తె బ్యానర్లో కార్తి డైరెక్టర్తో చిరు మూవీ

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య మంచి జోష్ మీద ఉన్నారు. ఆయన ఆచార్య లాంటి డిజాస్టార్ తర్వాత చేసిన గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలు సక్సెస్ ను ఇచ్చాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదైలన వాల్తేరు వీరయ్య మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వింటేజ్ చిరు ఇజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి.. చిరంజీవికి కూడా మంచి జోష్ను ఇచ్చిందనే చెప్పాలి.

అయితే ఈ మధ్య కాలంలో నిర్మాతగా మారిన సుస్మితా కొణిదెల.. ఈ సారి చిరు సినిమాకు నిర్మతగా వ్యవహారించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సినిమాకు సైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సర్దార్ సినిమా దర్శకుడు పీఎస్ మిత్రన్కు చిరంజీవి ఓకే చెప్పారని తెలుస్తోంది. కార్తి నటించిన సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తమిళ దర్శకుడికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ… చిరు కథను విన్నాడని.. నచ్చడంతో ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సుస్మిత కొణిదెల ఆమె భర్త విష్ణు ప్రసాద్ నిర్మాతలుగా ఉంటారని తెలుస్తోంది. ఇక ఇటీవల వారి బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై శ్రీదేవీ శోభన్ బాబు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ ఈ సినిమా డిజిటల్/శాటిలైట్ హక్కుల నుండి ఆదాయాన్ని పొందిందని చెప్పాలి.

ఇక అల్లుడు కుమార్తె బ్యానర్లో చిరంజీవి సినిమా చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం చిరు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ చిరుకు చెల్లెలుగా నటిస్తోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.