బాలయ్య వీడియో మరోసారి వైరల్

బాలయ్య, నాగార్జునకు పడదనే విషయం తెలిసిందే. అయితే బాలయ్య, గుణశేఖర్ కు కూడా పడదంటున్నారు నెటిజన్లు. జ్యూరీలో బాలయ్య ఉన్నాడు కాబట్టే రుద్రమదేవికి అన్యాయం జరిగిందంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో గతంలో బాలయ్య, గుణశేఖర్ ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

విశాఖలో జరిగిన టీఎస్ఆర్ అవార్డుల వేడుకలో గుణశేఖర్ ను కావాలనే బాలయ్య అవమానించారని, వేదికపై కనీస మర్యాద కూడా ఇవ్వలేదని అంటున్నారు. గుణశేఖర్ కు శాలువా కప్పే విధానం చూస్తేనే అతడిపై బాలయ్యకు ఎంత కోపం ఉందో అర్థమౌతుందంటున్నారు. మర్యాదపూర్వకంగా గౌరవించాల్సిన టైమ్ లో ముఖంపైకి శాలువా విసిరేసే లెవెల్లో బాలయ్య వ్యవహరించారు అప్పట్లో. ఆ శాలువా దెబ్బకు గుణశేఖర్ కళ్లజోడు కూడా జారిపోవాల్సింది. కానీ జస్ట్ మిస్.

రుద్రమదేవి సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా గుణశేఖర్ అవార్డు అందుకున్న సందర్భమది. ఇప్పుడదే సందర్భం నంది అవార్డుల విషయంలో రిపీట్ అయింది. అప్పుడు గుణశేఖర్ కు తన మార్క్ వ్యవహార శైలి చూపించిన బాలయ్య.. ఇప్పుడు నంది అవార్డుల విషయంలో కూడా అదే రిపీట్ చేశారని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తనకు నంది రాదనే విషయాన్ని గుణశేఖర్ అప్పుడే అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంత బాధ పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదని మరికొందరంటున్నారు.

నిజానికి అది పాత వీడియో. దాదాపు 7నెలల కిందటిది. అయితేనేం ఆ క్లిప్ ఇప్పటి సందర్భానికి అతికినట్టు సరిపోతోంది. అందుకే అప్పటి వీడియో మళ్లీ క్లిక్ అయింది. నంది అవార్డుల రచ్చ కారణంగా మరోసారి వైరల్ అవుతోంది.