కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ మూవీలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అయితే నాలుగో హీరోయిన్ కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ నాలుగో భామ పేరు రెజీనా అంటూ ప్రచారం కూడా జరిగింది. దీనిపై వెంటనే రియాక్ట్ అయింది రెజీనా. బాలయ్య 102వ సినిమాతో తనకు సంబంధం లేదని ప్రకటించింది.
బాలయ్య 102వ ప్రాజెక్టులో నయనతారను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. మరో సెకెండ్ హీరోయిన్ గా నటాషా దోషి, మూడో హీరోయిన్ గా హరిప్రియను తీసుకున్నారు. నాలుగో హీరోయిన్ గా తనను తీసుకున్నట్టు వచ్చిన వార్తల్ని రెజీనా ఖండించింది. ప్రాజెక్టులో తను లేనని ప్రకటిస్తూనే, యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
బాలకృష్ణ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో సినిమాకు సంబంధించి క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారు. ఈనెల 5న మొదలైన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్.. 15 వరకు జరిగింది. తాజా షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 60శాతం షూటింగ్ కంప్లీట్ అయింది.