బిగ్ బి దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అతడి ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ. అలాంటిది ఉన్నట్టుంది ఒకరోజు బిగ్ బి ఎకౌంట్ నుంచి సడెన్ గా ఫాలోవర్స్ సంఖ్య పడిపోయింది. దీంతో ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అమితాబ్. తప్పుకుంటానంటూ ఒక దశలో వార్నింగ్ కూడా ఇచ్చారు.

దీంతో ట్విట్టర్ అప్రమత్తమైంది. బిగ్ బిని కలిసేందుకు ఏకంగా ఒక టీంను పంపించింది. ఏకంగా అరడజను మంచి సభ్యుల బృందం అమితాబ్ ను కలిసింది. ట్విట్టర్ ఎలా పనిచేస్తుందో ఆయనకు వివరించింది. ఈ విషయాలన్నీ చెబుతూనే, ఓ ఫొటోను కూడా షేర్ చేశారు బిగ్ బి.ట్విట్టర్ ను సామాన్యుల కంటే సెలబ్రిటీలే ఎక్కువగా వాడుతుంటారు. దాని మనుగడ ఇంకా కొనసాగుతుందంటే దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలే. అలాంటి సెలబ్రిటీల్లో చాలామంది ఇప్పుడు ఇనస్టాగ్రామ్ వైపు మళ్లుతున్నారు. ట్విట్టర్ వాడకం తగ్గించేస్తున్నారు.

అందుకే వాళ్లను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తోంది ట్విట్టర్. ఇందులో భాగంగా తమపై కోపాన్ని ప్రదర్శించిన బిగ్ బిని కూడా ప్రత్యేకంగా కలిసింది ట్విట్టర్ టీం.