బ్రేక్ తీసుకోమని చెప్పేసిన పవన్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడనేది తెలిసిందే. లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ షెడ్యూల్ ఆగిపోవడంతో లాక్ డౌన్ ముగిసిన తర్వాత దిల్ రాజు చిత్రాన్ని ముందు పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడట. క్రిష్ తీస్తున్న జానపద చిత్రానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వకీల్ సాబ్ పూర్తి చేసుకుని ఆ సినిమా మొదలు పెడతానని చెప్పాడట.

క్రిష్ కి ఈ విషయం చెప్పేసి ఈలోగా వేరే పనులుంటే చేసుకోమని అనడంతో క్రిష్ కూడా హాట్ స్టార్ డిస్నీ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే పనిలో పడ్డాడట. పవన్ కి ఎలాగో రెండు, మూడు నెలల సమయం పడుతుంది కనుక ఈలోగా స్క్రిప్ట్ తో పాటు షూటింగ్ కూడా చేసేసుకోవచ్చునని క్రిష్ భావిస్తున్నాడట.

ఇదిలావుంటే పవన్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రంలో కథానాయికగా నటించడానికి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓకే చెప్పిందట. ఆమె డేట్స్ ఆగష్టు నుంచి అవసరం అవుతాయని చెప్పి పెట్టారట.