రిలీజ్ కు ముందే 10 నిమిషాల సినిమా

తమ సినిమాకు ప్రచారం కల్పించడానికి ప్రతి ఒక్కరు ఒక్కో రకమైన పద్ధతి ఫాలో అవుతారు. కానీ విజయ్ ఆంటోనీ పద్ధతిని మాత్రం ఎవరూ ఫాలో అవ్వలేరు. అది అతడికి మాత్రమే సాధ్యం. అవును.. విడుదలకు ముందే తన సినిమాను ప్రేక్షకులందరికీ చూపిస్తాడు విజయ్ ఆంటోనీ. గతంలో ఓసారి ఇలానే చేశాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు.

విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ ఇంద్రసేన. సీనియర్ నటి రాధిక, విజయ్ కలిసి నిర్మించారు ఈ సినిమాని. ఈనెల 30న రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలో కొంత భాగాన్ని విడుదలకు ముందే చూపించాలని డిసైడ్ అయ్యారు. ఆడియో ఫంక్షన్ రోజున 10నిమిషాల సినిమాను చూపించబోతున్నారు.

విజయ్ ఇలా చేయడం ఇది రెండోసారి. గతంలో భేతాళుడు సినిమా విషయంలో కూడా ఇలానే చేశాడు. 10నిమిషాల సినిమాను ముందే చూపించడం అనే కాన్సెప్ట్ అయితే వర్కవుట్ అయింది కానీ, సినిమా మాత్రం ఆడలేదు. మరి ఇంద్రసేన సినిమాకైనా ఈ ఎత్తుగడ పనిచేస్తుందేమో చూడాలి.