సినిమాకు 40 కోట్లు.. పవన్ పడతాడా?

ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. మరి నెక్ట్స్ ఏంటి? పవన్ ఇంకో సినిమా చేస్తాడా..? లేక అజ్ఞాతవాసి తర్వాత కొన్నాళ్లు సినిమాలు ఆపేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోతాడా..?

నిజానికి ఎన్నికలకు ముందు ఇంకో సినిమా చేసేంత టైం పవన్ కు ఉంది. కాకపోతే ఆ టైమ్ లో సినిమా చేస్తాడా.. జనసేన పార్టీని విస్తరించేందుకు కేటాయిస్తాడా అనేది మాత్రం సస్పెన్స్. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం పవన్ ను ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. పవన్ తో ఓ సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది ఆ సంస్థ.

పవన్ తో సినిమాపై నిన్న కూడా ఈ బ్యానర్ నిర్మాతలు పాజిటివ్ గా స్పందించారు. “కళ్యాణ్ బాబు కచ్చితంగా మాకు సినిమా చేస్తారు” అని అంటున్నాడు మైత్రీ నిర్మాతల్లో ఒకరు. దీనికి ఆయన చెబుతున్న రీజన్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది.

“పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయాలనేదే మా లక్ష్యం. పారితోషికం గురించి చర్చలు అనవసరం. కల్యాణ్ బాబు ఎంతంటే అంత. ఆయన కోసం 2-3 స్టోరీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆయన మాకు టైం ఇస్తే చాలు సినిమా ఓకే అయిపోయినట్టే.” ఇది నిర్మాతలు చెబుతున్న మాట.

తాజా సమాచారం ప్రకారం.. పవన్ ఒప్పుకుంటే ఏకంగా 40కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందట మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇంతకుముందే చెప్పుకున్నట్టు వాళ్లకు డబ్బు సమస్య కాదు.. తమ బ్యానర్ లో పవన్ తో సినిమా చేశామని చెప్పుకోవాలట. అందుకే దీన్ని వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

పవన్ తో ఈ టైమ్ లో సినిమా చేస్తేనే బెటర్. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేం. పవన్ పూర్తిగా రాజకీయాల్లోనే మునిగిపోతాడేమో..! అందుకే మైత్రీ మూవీస్ తొందరపడుతోంది. కలలో కూడా ఊహించని విధంగా 40కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పవన్ కు కూడా డబ్బు అవసరమే. కాకపోతే కేవలం డబ్బు కోసమే పవన్ ఈ సినిమా ఒప్పుకుంటాడని అనుకోలేం. ఇప్పుడు నిర్ణయం పూర్తిగా పవన్ చేతిలోనే ఉంది. మరో సినిమా చేయడమా.. పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లడమా..!