స్టాప్ ఆల్ పబ్లిసిటీ-బన్నీ

మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య పోటీ వుందని, దాని కారణంగా ఇద్దరి మధ్య కాస్త సమస్యలు వున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అయితే ఈ మధ్య కొన్నాళ్లుగా వీటికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని బన్నీ తన వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఆ మధ్య రంగస్థలం ప్రొడ్యూసర్లకు ఫోన్ చేయించి, నా పేరు సూర్య, రంగస్థలం సినిమాలకు సంబంధించిన కంటెంట్ లు విడుదల అన్నది ప్లాన్డ్ గా చేయాలని చెప్పించాడు. వాళ్లు వదిలితే వీళ్లు వెనక్కు వుంటారు. వీళ్లు వదుల్తామనంటే వాళ్లు ఆగుతారు. ఇలా అన్నమాట.

అలాగే కొరటాల శివతో సినిమా చేయాలని వున్నా, రామ్ చరణ్ తో కమిట్ మెంట్ వుంది కనుక, దాని విషయం తేలేవరకు తమ వైపు నుంచి ఏమీ మాట్లాడవద్దని తన జనాలకు చెప్పేసాడట. రామ్ చరణ్ సినిమా లేకపోతే, అప్పుడు కొరటాలను అడుగుదాం అన్నది బన్నీ ఆలోచన అంట.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాపేరు సూర్య పబ్లిసిటీ అంతా ఆపేయమని నిర్మాతలకు చెప్పాడట. ఉగాది అని, శ్రీరామ నవమి అని ఏవీ వదలవద్దని చెప్పేసాడట. రంగస్థలం విడుదల 30న వున్నందున ఇక నా పేరు సూర్య వ్యవహారాలు ఆ లోపు టచ్ చేయవద్దని నిర్మాతలకు చెప్పాడట.

మొత్తం మీద వీలయినంత వరకు ఎక్కడా అపోహలు రాకుండా బన్నీ బాగానే చూసుకుంటున్నాడు. నా పేరు సూర్య సినిమా మేలో విడుదలవుతుంది. అందువల్ల ప్రచారం ఆపినా ఇప్పుడు పోయేది లేదు. అదే కనుక చరణ్ కోసం ఆపితే, కాస్తయినా కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. అదీ బన్నీ ఆలోచనగా తెలుస్తోంది.