ఎక్స్ క్లూజివ్: పవన్‌, అజిత్‌లకు నిర్మాత పార్టీ

శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మాతగా బిజీ అవుతున్నారు. గతంలో బాలీవుడ్‌ కు మాత్రమే ఆయన పరిమితం అయ్యేవారు. కాని ఇప్పుడు ఆయన వరుసగా సౌత్‌ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో అజిత్‌ తో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న వకీల్‌ సాబ్‌ సినిమా నిర్మాణంలో కూడా దిల్‌ రాజుతో కలిసి భాగస్వామిగా ఉన్నాఉడ. వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ వ్యవహారాలు మొత్తం కూడా దిల్‌ రాజు చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు షూటింగ్‌ కు సంబంధించిన వ్యవహారాలు తెలుసుకుంటున్నాడు.

బోనీకపూర్‌ అజిత్‌ తో నిర్మిస్తున్న సినిమా వాలిమై ప్రస్తుతం హైదరాబాద్‌ లో షూటింగ్‌ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లోనే అజిత్‌ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. అతి త్వరలో హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో పవన్‌ మరియు అజిత్‌ లకు ఒక పార్టీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత బోనీ కపూర్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఇద్దరు కూడా పార్టీకి ఒప్పుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ పార్టీ ఉండబోతుంది. ఈ పార్టీకి కొందరు ప్రముఖ నిర్మాతలు మరియు ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా హాజరు కాబోతున్నారట. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందంటున్నారు. బోనీ కపూర్‌ పై గౌరవంతో పవన్‌ ఈ పార్టీకి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.