అఖిల్‌ కు జోడీగా ఆమెనే ఫిక్స్ చేశారట

అక్కినేని హీరో అఖిల్‌ 4వ సినిమా ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు అఖిల్‌ 5 సినిమా కూడా పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ 5 మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముంబయి మోడల్‌ సాక్షి వైధ్యను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆమెనే హీరోయిన్‌ గా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అఖిల్ తో గత ఏడాదే సినిమాను మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించేందుకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సమయంలో హీరోయిన్ గా ముంబయి మోడల్‌ సాక్షి వైధ్యను ఫైనల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను ఆడిషన్స్‌ చేయడంతో పాటు టెస్ట్‌ షూట్‌ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ తో ఒక భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ ను సురేందర్ రెడ్డి రూపొందించేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేశారు.