అఖిల్‌ స్టోరీ మారిపోయింది

అక్కినేని అఖిల్‌ రెండవ సినిమాకి విక్రమ్‌ కుమార్‌ దర్శకుడిగా ఖరారయ్యాక ఇక వేగంగా పట్టాలెక్కేస్తుందని అనుకున్నారు. కానీ ఇంతవరకు అఖిల్‌ రెండో చిత్రానికి కొబ్బరికాయ కొట్టలేదు.

జనవరిలోనే మొదలవుతుందని అనుకున్న ఆ చిత్రం ఎందుకు కదలడం లేదని నాగార్జునని అడిగితే, విక్రమ్‌ కుమార్‌ ముందుగా తమకి ఒక కథ చెప్పాడని, అది నచ్చిందని, కానీ ఆ కథని డెవలప్‌ చేయడంలో ఎలాంటి ప్రోగ్రెస్‌ లేదని, ఆ స్టోరీ ముందుకి కదలడం లేదని విక్రమ్‌ ఫీలవడంతో మరో కథ చెప్పాడని, అది కూడా బాగుండడంతో దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని నాగార్జున చెప్పారు.

ఈ కథ కూడా విక్రమ్‌ గత చిత్రాల్లానే ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని, చాలా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కనుందని, ఇది అఖిల్‌కి స్పెషల్‌ మూవీ అవుతుందని నాగ్‌ తెలిపారు. ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాతే సెట్స్‌ మీదకి వెళుతుందని, ఫిబ్రవరి నెలాఖరులో ముహూర్తం షాట్‌ తీస్తామని చెప్పారు.

మొత్తానికి మొదటి సినిమా వచ్చి ఏడాదికి పైగా అయిన తర్వాత అఖిల్‌ రెండవ చిత్రం ముందుకి కదులుతోంది. మరి ఫస్ట్‌ మూవీతో దక్కని విజయం ఈ చిత్రంతో అయినా అతడిని వరిస్తుందో లేదో చూడాలి.