వైకుంఠపురంలో టెంపర్‌ చూపిన హీరో

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది. నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకుంది. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ల కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వంద కోట్లకు పైగా షేర్‌ దక్కించుకున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతుంది. ఇప్పటికే భారీ మొత్తానికి హిందీ రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది.

ఈ రీమేక్‌ లో ఎవరు నటించబోతున్నారు అంటూ గత రెండు నెలలుగా చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా రీమేక్‌ విషయంలో ఇన్ని రోజులు చర్చలు నిలిచి పోయాయి. ఎట్టకేలకు మళ్లీ రీమేక్‌ సంబంధిత చర్చలు మొదలు అయ్యాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ లో బన్నీ పాత్రను బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మొదట ఈ రీమేక్‌కు సల్మాన్‌ ఖాన్‌ అయితే బాగుంటుందని మేకర్స్‌ భావించారు. కాని సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల నో చెప్పాడు. ఆ తర్వాత అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చేసిన హీరో షాహిద్‌ కపూర్‌ ఈ రీమేక్‌లో నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చివరకు రణ్‌ వీర్‌ సింగ్‌తో ఈ రీమేక్‌ను తెరకెక్కించబోతున్నారు.

ఇప్పటికే ఈయన తెలుగు సూపర్‌ హిట్‌ టెంపర్‌ ను సింబాగా రీమేక్‌ చేసి హిట్‌ అందుకున్నాడు. కనుక ఈ రీమేక్‌తో మరో హిట్‌ను రణ్‌ వీర్‌ సింగ్‌ అందుకోవడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. త్వరలోనే అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది.