ముందు జాగ్రత్తతో అనసూయ జబర్దస్త్‌కు బైబై #anasuya

తెలుగు బుల్లి తెర స్టార్స్‌ ఇంకా సెలబ్రెటీలను కరోనా భయం వణికిస్తోంది. గత నెలలో ప్రారంభం అయిన షూటింగ్స్‌ తో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. ఇంకా పలువురు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది షూటింగ్స్‌ కు హాజరు అయ్యేందుకు భయపడుతున్నారు. జబర్దస్త్‌ షూటింగ్‌ దాదాపు మూడు నెల గ్యాప్‌ తర్వాత రెండు వారాల క్రితం ప్రారంభం అయ్యింది. ఎప్పటిలాగే అనసూయ యమ జోరుగా షో కు యాంకరింగ్‌ చేసింది.

ప్రస్తుత కరోనా పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్స్‌ ను క్యాన్సిల్‌ చేసుకుంటున్న వారిలో అనసూయ ముందు ఉన్నారు. అమితాబచ్చన్‌ ఫ్యామిలీలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అంటూ వెళ్లడి అవ్వడంతో అనసూయ ఆందోళనతో జబర్దస్త్‌ కు బైబై చెప్పిందట. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి యాడ్‌ చిత్రీకరణ కోసం కొంత సమయం ఒక స్టూడియోకు వెళ్లిన అమితాబ్‌ కు కరోనా సోకి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడ్డట్లయ్యింది.

తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కారణంగా వారి ఆరోగ్య భద్రత నేపథ్యంలో జబర్దస్త్‌ షో కు వెళ్ల కూడదనే నిర్ణయానికి వచ్చిందట. కేవలం జబర్దస్త్‌ మాత్రమే కాకుండా ఇతర ఏ బుల్లి తెర షోలు ఇంకా షూటింగ్స్‌ కు హాజరు అవ్వకూడదనే నిర్ణయానికి వచ్చిందట. అనసూయ నిర్ణయంతో జబర్దస్త్‌ రెండు ఎపిసోడ్స్‌ కు కూడా రష్మి గౌతమ్‌ యాంకర్‌ గా వ్యవహరించే అవకాశం ఉంది. అనసూయ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.