భ‌ర‌త్ అను నేను.. దేవిశ్రీ క‌న్ఫ‌మ్ చేశాడు

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఆరంభ‌మై ఏడెనిమిది నెల‌ల‌వుతోంది. కానీ ఇప్ప‌టిదాకా దాని టైటిలేంటో వెల్ల‌డి కాలేదు. ఐతే మ‌హేష్ ఇంకా మొద‌లుపెట్ట‌ని కొర‌టాల శివ సినిమాకు మాత్రం టైటిల్ ఖ‌రారైపోయింది. ఈ చిత్రానికి ‘భ‌ర‌త్ అను నేను’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇది అఫీషియ‌ల్ టైటిలే అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట‌ల్ని బ‌ట్టి రూఢి అయిపోయింది. మ‌హేష్‌-కొర‌టాల సినిమాకు దేవిశ్రీ ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌లుపెట్టేయ‌డం విశేషం. కొర‌టాలతో క‌లిసి సంగీత చ‌ర్చ‌ల్లో ఉన్న ఫొటోల్ని ట్విట్ట‌ర్లో షేర్ చేసిన దేవి.. త‌న ట్వీట్‌కు ‘భ‌ర‌త్ అను నేను’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు. దీంతో ఈ టైటిల్ అఫీషియ‌లే అని క‌న్ఫ‌మ్ అయిపోయింది. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్న ర‌వి.కె.చంద్ర‌న్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొన‌డం విశేషం.

ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తాడని అంటున్నారు. ‘శ్రీమంతుడు’ తరహాలోనే మరో ఉదాత్తమైన కథాంశాన్ని మహేష్ కోసం రెడీ చేశాడట కొరటాల. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నాడు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్న మ‌హేష్‌.. వ‌చ్చే నెల‌లో కొర‌టాలతో మూవీని మొద‌లుపెట్టే అవ‌కాశముంది.