లక్ష పెట్టి శాతకర్ణి టికెట్ కొన్నాడు

బాలయ్య సినిమాను చూడటానికి ‘ఇదే సరైన సమయం మిత్రమా’ అంటున్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ వందో సినిమా కావటం.. క్రిష్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసేందే. ఈ సినిమా ఈ ఉదయం విడుదలైనప్పటికీ.. ప్రత్యేక ప్రీమియర్ షోను ఈ ఉదయం 5 గంటల వేళలో హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో ప్రత్యేక షో వేశారు. దీనికి బాలకృష్ణ.. ప్రముఖ దర్శకులు రాజమౌళి.. చిత్ర దర్శకుడు క్రిష్ తో పాటు.. నారా రోహిత్ తదితరులు హాజరయ్యారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం ఒక అభిమాని పెట్టిన ఖర్చు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాతకర్ణి ఒక టికెట్ ను రూ.1,00,100 పెట్టి మరీ కొనుగోలు చేశారు. ఈ లక్ష మొత్తాన్ని బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. కుకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ప్రదర్శించిన ప్రత్యేక షో కోసం గోపీచంద్ అనే అభిమాని ఇంత భారీగా ఖర్చు పెట్టటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.