ఆరుగురు దర్శకులతో సూపర్ స్టార్ స్పెషల్ మీటింగ్

సూపర్ స్టార్ మహేష్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో అత్యంత బిజీగా ఉండే స్టార్ లలో ఆయన ఒకరు. `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న మహేష్ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈమూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.

ఇటీవల సాక్షి అవార్డుల వేడుకలో పాల్గొన్న మహేష్ అదే విధంగా సైమా 2021 లోనూ సందడి చేశారు. `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి గానూ అవార్డుల్ని అందుకున్నారు కూడా. ఇదిలా వుంటే సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఆరుగురు స్టార్ డైరెక్టర్ లతో సీక్రెట్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారని.. పార్క్ హయత్ లో వారితో ప్రత్యేకంగా భేటీ అయి కొత్త కథలను వింటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం `సర్కారు వారి పాట`లో నటిస్తున్న మహేష్ ఈ చిత్రంలోని కొన్ని కీలక ఘట్టాల చర్చల కోసం దర్శకుడు పరశురామ్ తో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారట. ఇదే సమయంలో తన తదుపరి చిత్రం కోసం మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ తోనూ మహేష్ ప్రత్యేకంగా సిట్టింగ్ వేశారట. `సర్కారు వారి పాట` తరువాత త్రివిక్రమ్ తో మహేష్ ఓ భారీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథపై వివరణాత్మక చర్చలు జరుగుతున్నట్లు వినికిడి.

అంతే కాకుండా సూపర్ స్టార్ `ఉప్పెన` డైరెక్టర్ బుచ్చి బాబు సనా.. గోపీచంద్ మలినేనినిలతో ఒకే చోట సాధారణం గా కలుసుకోవడం జరిగింది. వీరితో పాటు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ వంగా కూడా మహేష్ బాబును కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇలా మహేష్ వరుసగా ఆరుగురు డైరెక్టర్ లను మీట్ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చగా మారింది.

మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` దాదాపుగా పూర్తయింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్.. జిఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని.. వెన్నెల కిషోర్.. సుబ్బరాజ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.