ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో కార్లు ఢీ

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆమె జగిత్యాల పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం కవిత జిగిత్యాల పర్యటనకు బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్న సమయంలో రాజారాంపల్లి వద్ద ఎమ్మెల్యే రవిశంకర్ కారు ముందు భాగానికి కవిత కారు కొద్దిగా తగిలింది. దీంతో కవిత కారు డ్రైవర్ సడెన్ బ్రేకే వేయడంతో వెనుకు వస్తున్న 5 కార్లతో కూడిన కాన్వాయ్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో కవితకు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఆమెకు పెను ప్రమాదం తప్పినట్టైంది. కాన్వాయ్ లో ఉన్నవారికి కూడా గాయాలు కాలేదు. వెంటనే కవిత మరో కారులో వెళ్లారు. ఆమె వెంట జగిత్యాల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు.