తన విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోడీ అరుదైన బహుమతుల్ని తీసుకెళుతుంటారు. తాను కలిసే దేశాధినేతలకు వాటిని అందజేస్తుంటారు. మోడీ ఇచ్చే బహుమతుల ఎంపిక చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెబుతుంటారు. చాలా.. జాగ్రత్తగా ఎంపిక చేసినట్లుగా మోడీ బహుమానాలు ఉంటాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాకు మోడీ ఇచ్చిన బహుమతులు ఆయన సంతోషాన్ని నింపటమే కాదు.. ఖుషీ అయ్యారని చెబుతారు.
తాజాగా మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా కొన్ని విలువైన బహుమతుల్ని తనతో తీసుకెళ్లారు. వైట్ హౌస్ లో ట్రంప్ దంపతులు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. భారత్ నుంచి తాను తీసుకెళ్లిన బహుమతుల్ని వారికి అందజేశారు. తాజా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు.. ఆయన సతీమణి మెలానియాకు ఇచ్చిన బహుమతుల్ని చూస్తే..
అమెరికా తొలి మహిళ మెలానియాకు కాశ్మీర్ లో చేతిలో తయారు చేసిన శాలువాను.. హిమాచల్ ప్రదేశ్ లో రూపొందించిన వెండి బ్రేస్ లెట్ ను బహుమతిగా అందజేశారు. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్కు.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన అబ్రహం లింకర్ మరణించిన 1965లో జారీ చేసిన ఒక పోస్టల్ స్టాంపును ఇచ్చారు. దీంతో పాటు.. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో కలపతో తయారు చేసిన అందమైన పెట్టెను కూడా బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ట్రంప్ ఆసక్తికరమైన అంశాల్ని చూపించినట్లుగా చెబుతున్నారు.ల అబ్రహం లింకన్కు చెందిన ప్రఖ్యాత స్పీచ్ కాపీని.. దానిని రాసుకునేందుకు వాడిన డెస్క్లను చూపించారు. ఈ స్పీచ్ లో ప్రభుత్వం ప్రజలది అన్న విలువైన వ్యాక్యం ఉంది. మొత్తానికి తన బహుమతులతో అమెరికా అధ్యక్షుల వారిని.. ఆయన సతీమణి మనసుల్ని మోడీ దోచుకున్నారని చెప్పక తప్పదు.