నాగ చైతన్య సోలో సినిమాల్లో ఇరవై అయిదు కోట్ల షేర్ దాటిన మొదటి సినిమాగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ నిలిచింది. ఇరవై కోట్ల రేంజిలో బిజినెస్ జరిగిన ఈ చిత్రం సూపర్హిట్ అని ట్రేడ్తో అనిపించుకుంది కానీ అక్కినేని నాగార్జున ఈ సినిమాతో పెట్టుకున్న గోల్ని మాత్రం రీచ్ అవలేదు.
ఈ చిత్రంతో నాగచైతన్య రేంజ్ పెంచాలని నాగార్జున భావించారు. అదే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, తన పనులన్నీ మానేసి ఈ చిత్రం నిర్మాణ వ్యవహారాల్లో బిజీ అయ్యారు. నాగచైతన్యకి కనీసం నలభై కోట్ల షేర్ వచ్చే సినిమా చేయాలనేది నాగార్జున గోల్. కానీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా చైతన్య మిగతా సినిమాల మాదిరిగానే ఒక స్థాయికి పరిమితమైంది.
నాని, శర్వానంద్లాంటి హీరోలు సైతం ఇంకా భారీ విజయాలు సాధిస్తూ వుండగా, ఇంత బ్యాక్గ్రౌండ్ వుండి, ఇన్ని వనరులు వుండి చైతన్యకి మాత్రం అనుకున్న ఫలితం దక్కడం లేదు. అఖిల్ రెండవ సినిమాపై దృష్టి పెట్టిన నాగార్జున అది అయిన తర్వాతే మళ్లీ చైతన్య చిత్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తారట. ఈసారి పేరున్న దర్శకుడిని తీసుకుని గోల్ కొట్టాలని నాగార్జున భావిస్తున్నట్టు భోగట్టా. హీరోలుగా కొడుకులు ఇద్దరినీ పెద్ద రేంజ్కి తీసుకెళ్లడమే నాగార్జున లక్ష్యంగా పెట్టుకున్నారట.