నర్తనశాల: భీముడిగా శ్రీహరి లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల అనే చిత్రం చాలా ఏళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. అనివార్య కారణాల వల్ల ఈ షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. బాలయ్య అర్జునుడిగా నటించాడు. శ్రీహరి భీముడి పాత్రలో, శరత్ బాబు ధర్మరాజు పాత్రలో, సౌందర్య ద్రౌపది పాత్రలను పోషించారు.

అప్పుడే ఆగిపోయిన ఈ చిత్రం ఇన్నేళ్ల తర్వాత విడుదల కానుంది. ఈ చిత్రం కోసం 17 నిమిషాల ఫుటేజ్ ను విడుదల చేస్తున్నట్లు బాలకృష్ణ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. నిన్న బాలకృష్ణ అర్జునుడి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు శ్రీహరి పోషించిన భీముడి పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

రియల్ స్టార్ శ్రీహరిని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూడనుండడంతో అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీముడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ఈ నెల 24న ఈ ఫుటేజ్ శ్రేయాస్ ఈటీ యాప్ లో విడుదల చేస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఛారిటీ కోసం వాడతానని బాలయ్య స్పష్టం చేసారు. మరి ఈ 17 నిమిషాల ఫుటేజ్ లో ఏ విశేషాలు ఉంటాయో చూడాలి.