తనయుడిని హీరోగా నిలబెట్టడానికి స్టార్ డైరెక్టర్లతో పాటు టాప్ రేంజ్ హీరోయిన్లు కూడా అవసరమని బెల్లంకొండ సురేష్ బలంగా నమ్ముతున్నట్టున్నాడు. మొదటి సినిమాలో సమంత, ప్రస్తుతం చేస్తోన్న బోయపాటి చిత్రంలో రకుల్ ప్రీత్ని తీసుకున్న సురేష్ తన కొడుకు శ్రీనివాస్ తదుపరి చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ని బుక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోలతో నటించడానికే కోటిన్నర వరకు ఛార్జ్ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ అనేసరికి తను చేస్తోన్న హీరోల రేంజ్ కంటే తక్కువ కావడంతో సహజంగానే పారితోషికం ఎక్కువ అడిగిందట. శృతిహాసన్ ఉండడం వల్ల శ్రీనివాస్ సినిమాకి వచ్చే అదనపు బెనిఫిట్స్ అన్నీ బెల్లంకొండకి ఎరుకే కనుక అమె అడిగినంత ఇవ్వడానికి సరేనన్నాడట.
ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ శృతి హాసన్కి పాతిక లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఆమెని ఖరారు చేసేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం చేస్తున్నట్టు ఇంకా శృతిహాసన్ అనౌన్స్ చేయలేదు. బోయపాటి సినిమా రిలీజ్ అయ్యేవరకు బెల్లంకొండ కూడా ఈ చిత్రానికి పబ్లిసిటీ కోరుకోవడం లేదు.