పవన్ – క్రిష్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తో కలిసి ఒక పీరియాడిక్ డ్రామాను చేస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దపు కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను పూర్తి చేయగా ఈరోజు నుండి మరో షెడ్యూల్ మొదలైంది. భారీ ఖర్చుతో నిర్మించిన 17వ శతాబ్దపు కాలం నాటి సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాతో సమాంతరంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ కు పూర్తవుతుంది. అప్పటి నుండి పూర్తి ఫోకస్ క్రిష్ సినిమాపైనే పెట్టనున్నాడు పవన్.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఏఎం రత్నం నిర్మాత.