పెళ్లిచూపులు హీరోయిన్.. వాట్ ఎ ఛాన్స్

పెళ్లిచూపులు’ సినిమా చాలామందికి లైఫ్ ఇచ్చింది. అందులో హీరోయిన్ రీతూ వర్మ కూడా ఒకరు. అంతకుముందు చిన్నాచితకా సినిమాలు, క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రీతూ.. ఈ సినిమా తర్వాత బిజీ అయిపోయింది. అడివి శేష్ హీరోగా మొదలైన ‘గూఢచారి’తో పాటు ఇంకో రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఐతే తాజాగా ఈ తెలుగమ్మాయికి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన ఆమె కథానాయికగా నటించబోతుండటం విశేషం. అది కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ‘ధృవ నక్షత్రం’లో కావడం ఇంకా పెద్ద విశేషం.

ముందు ‘ధృవ నక్షత్రం’ కోసం ‘మజ్ను’ భామ అను ఇమమాన్యుయెల్‌ను కథానాయికగా అనుకున్నాడు గౌతమ్. ఐతే డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లో మో.. మరో కారణంతోనో ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకుంది. ఈ పాత్రను ఎవరితో రీప్లేస్ చేయాలా అనుకుంటున్న టైంలోనే ‘పెళ్లిచూపులు’ సినిమా చూశాడు గౌతమ్. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నది గౌతమ్ బేనర్లోనే. అందులో రీతూ టాలెంట్ మెచ్చి ‘ధృవ నక్షత్రం’లో ఆమెకు ఛాన్సిచ్చేశాడు గౌతమ్. ఇది ఆమెకు లైఫ్ టైం ఛాన్స్ అనడంలో సందేహం లేదు. రీతూ స్థాయికి విక్రమ్ సరసన సినిమా అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమా హిట్టవ్వాలే కానీ.. రీతూ రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు.