సలార్: యష్ కథే ప్రభాస్ వద్దకు వెళ్ళింది

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే సలార్ కథ ప్రభాస్ వద్దకు ఎలా వెళ్ళింది అన్నదాని వెనకాల ఆసక్తికర కథ ఉంది. ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ ముందు రెండు కథలను ఉంచాడు. ఒకటి కేజిఎఫ్ కాగా మరొకటి సలార్. ఈ రెండిట్లో ఏదో ఒకదానితో సినిమా చేద్దామని ప్రశాంత్ నీల్ యష్ ముందు ప్రపోజల్ పెట్టాడు.

యష్ కు ఆ రెండు కథల్లో కేజిఎఫ్ బాగా నచ్చింది. విభిన్నంగా ఉంటుందని భావించి దాన్ని చేద్దామన్నాడు. కేజిఎఫ్ కథ విస్తరిస్తే దాన్ని రెండు భాగాల్లో చేయాలని నిర్ణయించుకున్నారు. సో కేజిఎఫ్ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యమైంది. ప్రస్తుతం కేజిఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

యష్ వద్దనుకున్న కథను కొద్దిపాటి మార్పులతో ప్రభాస్ వద్దకు తీసుకెళితే రెబెల్ స్టార్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. అదీ సంగతి.