ప్రకాశ్ రాజ్ పై బండ్ల గణేశ్ ఫైర్.. పవన్ ను ‘ఊసరవెల్లి’ అన్న వాఖ్యలపైనే

పవర్ స్టార్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.. ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిన విషయమే. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పవన్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా నటుడు ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ లో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ను ‘ఊసరవెల్లి’ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో జరిగిన పొత్తు విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గతంలోనే నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

దానికి ప్రకాశ్ రాజ్ కూడా తనకు ఆ లాంగ్వేజ్ రాదు అని ట్విట్టర్ లో అన్నారు కూడా. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఎందుకని మాట్లాడలేదు కానీ.. పవన్ ఎంతో నిజాయితీపరుడు అంటూ వరుస ట్వీట్స్ తో ప్రకాశ్ రాజ్ తీరుపై మండిపడ్డారు. అదే రీతిలో పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ ను ఎవరేమన్నా సహించను అని తన ట్వీట్స్ ద్వారా తెలిపారు.

ఎలక్షన్ టైం లో మాట్లాడటం ధర్మం కాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు నేను ఒకటి మాత్రం చెప్తున్నా..
నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత నాకు తెలుసు.
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు. రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం.
ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్‌.
నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది.
నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష” అని బండ్ల గణేష్‌ వరుస ట్వీట్స్ చేసి తన అభిమానాన్న చాటుకున్నారు. అయితే.. గణేశ్ ట్వీట్లలో ప్రకాశ్ రాజ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. పరోక్షంగా మాత్రమే స్పందించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తారో లేదో చూడాలి.