పూరి కంట్లో పడ్డ కొత్త పోరీ

పూరి జగన్నాథ్‌ తెలుగు సినిమాకి పరిచయం చేసినంత మంది హీరోయిన్లని మరే దర్శకుడు పరిచయం చేసి వుండడంటే అతిశయోక్తి కాదు. కొత్త హీరోయిన్ల అన్వేషణకి పూరి జగన్నాథ్‌ ప్రత్యేకంగా కృషి చేస్తుంటాడు. అతని సినిమాలకి హీరోయిన్లని ఎంపిక చేయడం కోసం ప్రత్యేకంగా ఒక విభాగం వుందని అంటుంటారు. ప్రస్తుతం ఆ విభాగాన్ని హ్యాండిల్‌ చేస్తోంది ఛార్మి అనే రూమర్‌ కూడా వుంది.

తెలుగు చిత్ర సీమకి ఎంతో మంది సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్లని అందించిన పూరి జగన్నాథ్‌ రీసెంట్‌గా ఇంట్రడ్యూస్‌ చేసిన దిశా పటాని ఇప్పుడు బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతోంది. పూరి ‘రోగ్‌’ సినిమా కోసం ఏంజెలీనా క్రిస్‌లింజ్‌కీ అనే కొత్త హీరోయిన్‌ని తీసుకున్నాడు. పోలాండ్‌కి చెందిన ఏంజెలీనా ముందుగా ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో ఒక ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించింది. తర్వాత సరాసరి ఆమెకి హీరోయిన్‌గా ప్రమోషన్‌ ఇచ్చేసి ‘రోగ్‌’ని ఆమె చేతిలో పెట్టేసాడు.

పూరి ద్వారా పరిచయమైన హీరోయిన్లలో ఎంతో మంది స్టార్లుగా సెటిల్‌ అవడంతో తనకీ అతని హస్తవాసి కలిసి వస్తుందని ఏంజెలీనా కలలు కంటోంది. ‘రోగ్‌’ చిత్రంలో ఏంజెలినా అందాల ప్రదర్శన సౌందర్యారాధకులకి మత్తెక్కిస్తుందనేది ఇండస్ట్రీ టాక్‌.