డ్రగ్స్ కేసులో ప్రధాన అనుమానితుడుగా పూరి జగన్నాథ్ని మీడియా చిత్రీకరిస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టే సిట్ ముందుగా పూరి జగన్నాథ్నే విచారణకి పిలిపించింది. పది గంటల పాటు వాళ్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వచ్చిన పూరి జగన్నాథ్ ఇంతకాలం తనగురించి మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నా స్పందించలేదు.
అయితే సిట్ విచారణని కూడా రాంగ్గా ప్రచారం చేసారని, తెలిసీ తెలియని రాతలతో తనని నిందితుడిగా చిత్రీకరించారని పూరి హర్టయ్యాడు. తనతో సన్నిహిత సంబంధాలున్న మీడియా వాళ్లు తన గురించి దారుణమైన కథనాలని ప్రసారం చేయడం పట్ల పూరి మండిపడ్డాడు. జీవితాలని నాశనం చేస్తున్నారని ఆరోపించాడు. తన భార్యా, పిల్లలు నాలుగు రోజులుగా ఏడుస్తూనే వున్నారని, తనకి డ్రగ్స్ అలవాటు లేదని, ఎలాంటి చట్ట విరుద్ధమైన పనిని తాను చేయనని, బాధ్యతాయుతంగా నడుచుకుంటానని, కానీ తనని ఇలా చిత్రీకరించారని పూరి బాధ పడ్డాడు.
అయితే ఈ వ్యవహారానికి మూల విరాట్టు అయిన కెల్విన్తో పూరికి సంబంధాలున్నాయనే పక్కా ఆధారాలు పోలీసుల వద్ద వున్నాయనేది మీడియా కథనం. పూరి సినిమా జ్యోతిలక్ష్మి ఈవెంట్లో కెల్విన్ కనిపించడంతో, దానికి ఫోటో సాక్ష్యాలు వుండడంతో మీడియా పూరిని కార్నర్ చేస్తోంది. కానీ పూరి మాత్రం అవన్నీ వచ్చినప్పటికీ అతనెవరనేది తనకి తెలియదని ఖచ్చితంగా చెప్పాడు. ఇన్ని రోజులు సైలెంట్గా వున్నవాడే తన గురించి చేస్తోన్న వీడియో కార్యక్రమాలకి బదులు ఇవ్వడానికి వీడియోనే విడుదల చేసాడు.