ఒరేయ్..బుజ్జిగా..డీల్ ఫైనల్

రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో రాధామోహన్ నిర్మించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఓటిటికి ఫైనల్ చేసారని పది రోజుల కిందటే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆహా సంస్థకు ఒరేయ్ బుజ్జిగా సినిమాను మూడున్నర కోట్లకు, అలాగే శాటిలైట్ ను కోటిన్నరకు ఇచ్చేసారంటూ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ రెండు డీల్స్ ఫైనల్ అయ్యాయి. అగ్రిమెంట్ లు కూడా జరిగిపోయాయి. జీ టీవీకి శాటిలైట్ ఇచ్చారు. ఆహా కు ఓటిటి రైట్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆహా రేపు ప్రకటించబోతోంది. జీ టీవీ దీపావళికి ప్రయిమ్ మూవీ ప్రచారంతో ఒరేయ్ బుజ్జిగా సినిమాను విడుదల చేస్తుంది. ఆ సినిమాకు బాగా ముందుగానే ఆహా లో విడుదలవుతుంది. సినిమా ప్రకటనతో పాటే, డేట్ కూడా వచ్చేస్తుంది.

కరోనా కారణంగా విడుదల ఆగిపోయిన సినిమాల్లో ఒరేయ్ బుజ్జిగా ఒకటి. ఇప్పటికే వి సినిమా ఒటిటి లో విడుదలయిపోయింది. నిశ్శబ్ధం, మిస్ ఇండియా డీల్స్ సైన్ కావాల్సి వుంది.