కరోనా నుంచి కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. హెల్త్ బులెటిన్ విడుదల

తెలుగు సినిమా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇటివల కోవిడ్19 బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

‘రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారు. వైద్యుల ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ప్లాస్మా చికిత్స కూడా అందిస్తున్నాం’ అని డాక్టర్ రత్న కిశోర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇటివల రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చిన్న కుమార్తె శివానీ చేసిన్ పోస్ట్ కలకలం రేపింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని చిరంజీవి, మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు.

కరోనాకు రాజశేఖర్ తోపాటు, ఆయన భార్య జీవిత, పిల్లలు శివాత్మిక, శివానీ కూడా ఎఫెక్ట్ అయిన విషయం తెలిసిందే. పిల్లలు త్వరగానే కోలుకున్నారు. జీవితకు ఇటీవలే నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.