షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.! #regina

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు గత ఏడాది తెలుగులో ‘ఎవరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. కరోనా పాండెమిక్ వలన అందరూ షూటింగ్ లకి చెక్ పెట్టి ఇంట్లో ఉన్నారు. కానీ రెజీనా మరియు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారని ఇది వరకే తెలిపాం.

దీనికి సంబందించిన షూటింగ్ ని కూడా లాక్ డౌన్ టైంలో పూర్తి చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ముందుగా ఇదొక షార్ట్ ఫిలిం లాగా మొదలు పెట్టారు. ఆ తర్వాత కథానుగుణంగా మార్చుకుంటూ ఒక గంట నిడివి గల మినీ మూవీలా షూట్ చేశారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని త్వరలోనే ఓటిటి వేదికగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మినీ మూవీ, అందులోనూ విజయ్ సేతుపతి – రెజీనా కసాండ్ర లాంటి స్టార్స్ ఉండడంతో ఓ మంచి ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే ఇది రిలీజ్ అవుతుందని కోలీవుడ్ సమాచారం. దీంతో రెజీనా, విజయ్ సేతుపతిలు ఓటిటి లోకి ఎంటర్ కానుండడం విశేషం.