నేను బ్రతికే ఉన్నాను, రూమర్స్ ని నమ్మద్దు – లెజండ్రీ సింగర్ ఎస్ జానకి

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ లలో రియాలోఈ కంటే ఫేక్ ఎక్కువ అయ్యింది. ఎవరో కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చిన వార్తల్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తావున్నారు. అలా తాజాగా లెజండ్రీ సింగర్ చనిపోయారనే వార్తని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది విన్న చాలా మంది ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. కానీ ఉదయమే స్టార్ సింగర్ ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు జానకమ్మ గారికి ఏం కాలేదని ఆమె చాలా బాగుందని ఓ వీడియో ద్వారా అందరికీ మెసేజ్ చేరవేశారు.

తాజాగా జానకి గారే ఓ వాయిస్ మేస్జ్ ద్వారా తన బాగోగులని తెలిపారు. నేను మైసూర్ లో ఉన్నాను. నాకేం కాలేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరో కొందరు సృష్టించిన రూమర్స్ ని నమ్మి ఏడుస్తూ నాకు ఎందరో ఫోన్ చేస్తున్నారు. వారిని ఓదార్చలేకపోతున్నాను. నేను బ్రతికే ఉన్నాను. ఇలా ఇలా తెలిసీ తెలియకుండా వచ్చే వార్తల్ని నమ్మవద్దని’ జానకి గారు అన్నారు. దీంతోనైనా ఈ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడం ఆగాలని ఆశిద్దాం.