భరించేవాడికే బాధలు.. తట్టుకున్నాను.. గెలిచాను: సంజయ్ దత్

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఆగష్టు నెలలో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను కొన్నాళ్లు షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాను. ఆరోగ్య కారణాల వల్ల ఈ బ్రేక్ తీసుకుంటున్నాను అని అప్పట్లో తెలిపాడు. ఈ వార్త అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు వివరాలు వెల్లడించాడు.

‘కొన్ని వారాలుగా నా కుటుంబమంతా చాలా కష్ట కాలం అనుభవించాం. భరించేవాడికే భగవంతుడు బాధలు ఇస్తాడనే మాట నా విషయంలో నిజమైంది. ఈరోజు నా పిల్లల పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. నేను ఆరోగ్యవంతుడిగా తిరిగొచ్చాను. నా అభిమానులు, కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదాల వల్లే నేను ఆరోజు కోలుకున్నాను. నా పిల్లల పుట్టినరోజుకు నేను ఇచ్చే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇదే. కోకిలాబెన్ ఆస్పత్రివర్గాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. డాక్టర్ సేవంతి వారి టీమ్ చాలా బాగా ట్రీట్ చేశారు. ఈ సందర్భంగా నా ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారిక, కోకిలాబెన్ ఆస్పత్రవర్గాలకు రుణపడి ఉన్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సంజయ్ దత్ కేజీఎఫ్2, షంషేరా, భుజ్, పృథ్వీరాజ్, తోర్బాజ్ సినిమాల్లో నటిస్తున్నాడు.