సర్కారు వారి పాట పాడనున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, పరశురామ్‌ల కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్‌ హిట్‌ తర్వాత మహేష్‌బాబు, గీత గోవిందం వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పరశురామ్‌ లు చేస్తున్న చిత్రం అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేల ఉన్నాయి. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు గాను స్టార్స్‌ పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. కాని చివరకు తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ ను రంగంలోకి దించే యోచనలో పరశురామ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

బుల్లి తెరపై మంచి క్రేజ్‌ ను దక్కించుకున్న నటుడు కౌశల్‌. గతంలో విలన్‌ గా కౌశల్‌ చాలా సీరియల్స్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ తో సినిమాల్లో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా తన స్థాయికి తగ్గట్లుగా లేవు అంటూ వదిలేశాడు. ఇప్పుడు మహేష్‌బాబు సినిమాలో ఆఫర్‌ రావడంతో చాలా సంతోషంగా ఒప్పేసుకున్నాడట.

బ్యాకింగ్‌ రంగంలో ఉన్న అవినీతి మరియు కొన్ని రకాల సమస్యలపై ఈ చిత్రంను పరశురామ్‌ తీయబోతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందట. విలన్‌ పాత్రకు గాను కౌశల్‌ అయితే అన్ని విధాలుగా బాగుంటుందని భావించి ఆయన్ను ఎంపిక చేయడం మహేష్‌ బాబు కూడా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చేశాడట. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది దసరా వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.