దర్శకుడు శేఖర్‌ కమ్ములకి పితృవియోగం.!

ఈమద్య కాలంలో వరుసగా సినీ ప్రముఖుల ఇళ్లలో విషాదం చోటు చేసుకుంటుంది. 2020 ఏడాదిలో అన్ని విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

ఊపిరి సంబంధిత సమస్యతో బాధపడుతున్న కమ్ముల శేషయ్యకు వెంటి లేటర్‌పై చికిత్స అందించారు. ఆయన్ను కాపాడేందుకు వైధ్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో నేడు ఉదయం ఆయన మృతి చెందాడు. కరోనా పరిస్థితుల కారణంగా నేడు సాయంద్రం వరకు బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో ఆయన అంత్య క్రియలు చేయబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ఒకటి రెండు సినిమాల్లో కమ్ముల శేషయ్య కనిపించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శేఖర్‌ కమ్ములకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.