చాలామంది వర్తమానం కంటే గతం బాగున్నట్లుగా ఉంటుంది. తెలుగు ఇండస్ర్టీలో దుమ్ము రేపుతున్న హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా అదే ఫీలింగులో ఉన్నట్లుంది. ఆమెకు ఈతరం రొమాన్సు నచ్చడం లేదట.. గతకాలం శృంగారమే మేలంటోంది.
అప్పట్లో రొమాన్స్ పుట్టే సందర్భాలు ఆసక్తికరంగా ఉండేవని…ఇప్పుడు ఆ మజా దొరకడం లేదని లోతుల్లోకి వెళ్లి మరీ చెబుతోందీ ఈ అమ్మడు. స్పీడు యుగంలో చిలిపి పనుల్లో చతురత కనిపించడం లేదన్నది ఈ సుందరి పరిశీలన. ‘‘శృంగారం.. కాలం తెచ్చిన మార్పు’’ అనే అంశంపై శృతి మాట్లాడుతూ… తన టీనేజి నాటి రోజులకు ఇప్పటికి ఎంతో మారిపోయిందని చెప్పుకొచ్చింది.
నా టీనేజ్ లో చూసిన ప్రేమాయాణాలన్నీ రహస్యంగా, భయపడుతూ సాగినవే. ఆ భయంలోనే ఎంతో ఉద్వేగం ఉండేది. కలవడం కుదరనప్పుడు ప్రేమించిన వాళ్లతో మాట్లాడుకోవాలంటే ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఆధారం. వాటికి ఫోన్ చేస్తే…ఇంట్లో వాళ్లు ఎవరు తీస్తారో అని భయం ఉండేది. ప్రేమికుడే ఫోన్ తీస్తే ఆ రోజు అదృష్టం బాగున్నట్లే. ఇప్పటి యువతీ యువకుల ప్రేమలో అలాంటి సస్పెన్స్ లు ఉండటం లేదు.
మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలోకి చేరాక…నచ్చిన వాళ్లతో మాట్లాడటం…చూడటం..ఇబ్బంది లేకుండా కలుసుకోవడం సులభమైపోయిందంటోందీ సుందరి. అంతేకాదు.. ఇష్టపడగానే ఇన్స్టంట్ రొమాన్స్ మొదలుపెడుతున్నారని చెబుతోంది. అందుకే దాని విలువ ఇప్పటివాళ్లకు తెలియడం లేదని.. మా యవ్వనంలో ఇంత సులువుగా రొమాంటిక్ అవకాశాలు దొరక్కున్నా…ఆ దాగుడు మూతలే బాగుండేవని చెబుతోంది. మొత్తానికి అమ్మాయిగారికి టీనేజి నుంచే ఫుల్లు ఎక్స్పీరియన్సు ఉన్నట్లుంది.