సుచీ లీక్స్‌: పాపం ఆ హీరోయిన్ల పరువు తీసా!

సింగర్‌ సుచిత్ర తన లీకేజీ హంగామాని అర్ధాంతరంగా ఆపేసి మాయమైన సంగతి తెలిసిందే. మానసికమైన సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె భర్త చెప్పడం, ఆమె పెళ్లి విడాకులకి దారి తీసిందనే వార్తలు రావడం తప్ప సుచిత్ర ఏమైందనేది ఎవరికీ తెలియదు.

ప్రస్తుతం యుఎస్‌లో చికిత్స తీసుకుంటోన్న సుచిత్ర అప్పట్లో బయటపెట్టిన ఫోటోలు, వీడియోల గురించి చింతిస్తోంది. అనవసరంగా కొందరు అమాయకులైన తారల ఫోటోలు లీక్‌ అయ్యాయని, వారికి అలా జరిగి వుండకూడదని, ఆ ఫోటోలు తన అకౌంట్‌ నుంచి ఎలా లీక్‌ అయ్యాయనేది తనకి తెలియదని, అది ఎవరో హాకర్లు చేసిన పనే అయి వుంటుందని సుచిత్ర అంటోంది.

ధనుష్‌, అనిరుధ్‌లాంటి పెద్ద తలకాయల్ని బజారున పడేస్తానంటూ బెదిరించి చిన్న హీరోయిన్లు ఇద్దరి పరువు తీసిన ఆ సుచీ లీక్స్‌ ఉదంతం ఇప్పటికీ సస్పెన్స్‌గా, కోలీవుడ్‌ హిస్టరీలో ఆన్‌లైన్‌ సెన్సేషన్‌గా మిగిలిపోయింది. ఇదంతా పక్కన పడేసి మళ్లీ త్వరలోనే సినీ రంగానికి వస్తానని, మళ్లీ పాటలతో బిజీ అవుతానని సుచిత్ర ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సుచిత్రని మళ్లీ కోలీవుడ్‌లో అడుగుపెట్టనిస్తారా అనేది మాత్రం అనుమానమే.