ఎక్స్ క్లూజివ్: సుకుమార్ కి నచ్చని సెట్, షూట్ కాన్సిల్.!

‘అల వైకుంఠపురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ కొల్లగొడుదామని సుకుమార్ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన సినిమా ‘పుష్ప’. కోవిడ్ పరిస్థితుల వలన షూటింగ్ వాయిదా పడింది, అలాగే ఈ ఏడాది చివరి వరకూ మొదలయ్యే అవకాశం లేదు.

మొదటగా చిత్తూర్ ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెట్ అవ్వడం లేదు. కానీ రీసెంట్ గా ‘రంగస్థలం’ స్టైల్ లో హైదరాబాద్ లోనే సెట్ వేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సెట్ వేశారు. కానీ సుకుమార్ కి ఆ సెట్ ఏ మాత్రము అనుకున్నట్టు రాకపోవడంతో ఆ సెట్ ని కాన్సల్ చేసేసాడు. ప్రస్తుతం లేట్ అయినా రియలిస్టిక్ లొకేషన్స్ కి వెల్దామనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ముందుగా అనుకున్న దాని ప్రకారం వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ చేద్దామనుకున్నారు. కానీ పరిస్థితుల వలన సెట్ కి వెళదామని ట్రై చేసి, సరిగా రాకపోవడంతో ఆపేసారు. ఇక్కడ నిర్మాతలకి సేవ్ అయ్యే విషయం ఏమిటంటే.. ముందు నుంచే ఫైనల్ సెట్ లా కాకుండా ఒక శాంపిల్ సెట్ లానే దీనిని ప్లాన్ చేశారు. సో వర్కౌట్ అవ్వదు అనిపించడంతో ముందే ఆపేసారు. దాంతో చాలా వరకూ నిర్మాతకి చాలా బడ్జెట్ సేవ్ అయ్యింది.

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం విలన్ ఎవరు అనేదానిపై అన్వేషణ ఇంకా జరుగుతోంది. అల్లు అర్జున్ అందులో గంధపు చెక్కల స్మగ్లర్ గా, కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు.