ముంబయి రాక కోసం ఎదురు చూస్తున్నానంటున్న సన్నీ

మాజీ పోర్న్‌ స్టార్‌ బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్నారట. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో భర్త మరియు పిల్లలతో కలిసి సన్నీలియోన్‌ అక్కడకు వెళ్లారు. భర్త డానియల్‌ తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. వారిని చూసుకునేందుకు ఈ సమయంలో తాము అక్కడ ఉండాల్సి వచ్చింది అంటూ సన్నీలియోన్‌ పేర్కొంది. డానియల్‌ మదర్‌ వయసులో చాలా పెద్ద వారు. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి సాయంగా ఉండాలని ముంబయి నుండి హడావుడిగా లాస్‌ ఏంజిల్స్‌కు వచ్చేసినట్లుగా సన్నీలియోన్‌ చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ఇంగ్లీష్‌ పత్రికతో ఆమె మాట్లాడుతూ.. ముంబయి నుండి వచ్చే సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా బాధపడుతూనే ముంబయిని విడువాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగి అంతర్జాతీయ విమానాలు నడిచిన సమయంలో ఖచ్చితంగా డానియల్‌ పిల్లలతో కలిసి ముంబయికి వస్తానంటూ పేర్కొంది. ముంబయికి రావడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు ముంబయిలో అడుగు పెట్టాలా అన్నంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నట్లుగా సన్నీ చెప్పింది.

బాలీవుడ్‌లో వరుసగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు పలు చిత్రాల్లో ఐటెం సాంగ్‌ను చేయడం కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం వంటివి చేస్తున్న ఈ అమ్మడు సౌత్‌లో కూడా సినిమాలు చేసింది. త్వరలో మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించేందుకు కమిట్‌ అయ్యింది. ఈలోపు ఈ కరోనా విపత్తు వచ్చి మొత్తం పరిస్థితులు తలకిందులు అయ్యాయి. సన్నీలియోన్‌ ఇండియా వచ్చేందుకు మరికొన్ని నెలలు అయినా పట్టే అవకాశం ఉంది.