ఆత్మహత్యకు ముందు అక్కతో సుశాంత్‌ చాటింగ్‌

బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి చెంది నెలన్నర రోజులు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు అభిమానులు ఆయన జ్ఞాపకాల్లోనే ఉన్నారు. ఆయన గురించి తల్చుకుంటూనే ఉన్నారు. మెల్ల మెల్లగా ఆయన జ్ఞాపకాల నుండి బయటకు వస్తున్న సమయంలో దిల్‌ బేచారా చిత్రంతో మరోసారి అందరి హృదయాలను కదిలించాడు. ఆ సినిమాలో అద్బుతమైన నటన కనబర్చి మరింతగా మనసుకు దగ్గర అయ్యాడు. సుశాంత్‌ మరణించి ఉండకుంటే ఖచ్చితంగా దిల్‌ బేచారా సినిమాకు అవార్డు వచ్చేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే సుశాంత్‌ మరణంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ చాలా డిప్రెషన్‌కు లోనవ్వడం వల్లే మృతి చెందాడని అంటున్నారు. తాజాగా సుశాంత్‌ తన అక్కతో చివరి సారి చేసిన ఛాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎలా ఉన్నావు బాబు ఐలవ్‌ యు. నా వద్దకు రావచ్చు కదా కొన్ని రోజులు ఇక్కడ ఉండేందుకు అంటూ అక్క శ్వేత సింగ్‌ వాట్సప్‌ లో మెసేజ్‌ పంపగా సుశాంత్‌ బహుత్‌ మన్న్‌ కరాబ్‌ హె ది (మనసు ఏమాత్రం బాగాలేదు) అంటూ సమాధానం చెప్పాడు. సుశాంత్‌ ఆత్మహత్యకు నాలుగు రోజుల ముందు ఈ సంభాషణ జరిగిందట. ఆ సమయంలోనే సుశాంత్‌ చాలా డిప్రెషన్‌ లో ఉన్నట్లుగా అర్థం అయ్యింది. చాలా రోజు డిప్రెషన్‌ తర్వాత సుశాంత్‌ ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు.

తమ్ముడి మరణంపై శ్వేత స్పందిస్తూ.. అమ్మా నాన్నలకు మొదట అబ్బాయి పుట్టి వెంటనే చనిపోయాడు. మళ్లీ అబ్బాయి కావాలని కోరుకుంటే నేను పుట్టాను. నా తర్వాత తమ్ముడు పుట్టాడు. నేను తమ్ముడిని చాలా ఆప్యాయంగా చూసుకోవాలనుకున్నాను. నా కోసం ఒక రోజు క్లాస్‌ నుండి వచ్చాడు. నా క్లాస్‌ లో ఎవరికి తెలియకుండా వాడిని దాచి పెట్టానంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది.