తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా తగ్గినా బాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే తాప్సీ ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసి తన బాధను పంచుకుంది. తన ఇంట్లో జరిగిన ఓ విషాద సంఘటనకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాప్సీ వాళ్ల బామ్మ ఈరోజు తుది శ్వాస విడిచింది.

బామ్మతో తనకు ఉన్న ఎటాచ్ మెంట్ వల్ల తాప్పీ తన బాధను సోషల్ మీడియా వేదికగా అన అభిమానులతో పంచుకుంది. గురుద్వారలో జరిగిన తన బామ్మ అంత్యక్రియలకు సంబంధించి ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పిక్ లో తాప్పీ బామ్మ ఫొటో ఉంది. ‘కుటుంబంలోని ఓ తరానికి చెందిన ఆఖరి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లిపోతే ఆ బాధ తీర్చలేనిది. వారి జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి’ అని తన వాల్ లో రాసుకుంది. తాప్సీ ఎమోషనల్ పోస్టుకు అభిమానుల నుంచి మద్దతు వస్తోంది. తాప్సీని ఓదారుస్తూ మెసేజెస్ చేస్తున్నారు.