ఇన్ సైడ్ టాక్: ఎన్టీఆర్-రామ్-మహేష్: త్రివిక్రమ్ అసలేం జరుగుతోంది?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. తనపై ఉన్న అనుమానాలు అన్నీ ఈ ఒక్క సినిమాతో దూరం చేసాడు. తన నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో తెరకెక్కించాలనుకున్నాడు. అంతా పెర్ఫెక్ట్ గా జరుగుతోంది అనుకున్న సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ సాగలేదు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ కూడా వాయిదా పడిన విషయం తెల్సిందే. రీసెంట్ గా తిరిగి మొదలైన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ కు షిఫ్ట్ అయింది. అంటే త్రివిక్రమ్ కుదిరితే క్విక్ టైమ్ లో ఒక సినిమాను పూర్తి చేయవచ్చు.

ఒకవైపు నుండి మహేష్-త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది, ముఖ్యంగా నమ్రత వైపు నుండి త్రివిక్రమ్ కు మహేష్ తో సినిమా చేయమని ప్రెజర్ పెరుగుతోందట. మరోవైపు నిర్మాత స్రవంతి రవి కిషోర్ కు ఎప్పటినుండో సినిమా చేయాలి త్రివిక్రమ్. అది ఇప్పుడు స్రవంతి రవి కిషోర్, రామ్ తో సినిమా చేయమని అడుగుతున్నాడట.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఇష్టంగా లేడు. రామ్ తో అయితే ఆలోచిస్తా కానీ మహేష్ తో అయితే ససేమీరా అంటున్నాడట. చూడాలి మరి ఏం జరుగుతుందో.