భారీ ఆఫర్‌ తిరస్కరించిన ‘ఉప్పెన’ దర్శకుడు

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన సినిమాతో పరిచయం చేయబోతున్న దర్శకుడు బుచ్చి బాబు సన కు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. మొదటి సినిమాకే మంచి హైప్‌ ను తీసుకు రావడంతో పాటు గురువు సుకుమార్‌ కు తగ్గ శిష్యుడు అంటూ బుచ్చి బాబు పేరు దక్కించుకున్నాడు. అందుకే ఆయనతో సినిమాలకు యంగ్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తున్న సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ వారు బుచ్చిబాబుతో ఒక సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నారు. దాదాపుగా 75 లక్షల రూపాయల అడ్వాన్స్ ను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

కథ మరియు హీరో రెండు మీ ఛాయిస్ అంటూ బుచ్చి బాబుకు ఓపెన్‌ ఆఫర్‌ ను ఇవ్వడం జరిగింది. కాని బుచ్చి బాబు మాత్రం అందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. తదుపరి సినిమాను మైత్రి మూవీస్ లోనే చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఉప్పెన ప్రమోషన్‌ లో ఉన్న బుచ్చి బాబు త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ తర్వాత మళ్లీ సుకుమార్ సలహాలు సూచనల మేరకు తదుపరి సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. ఆ సినిమా ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు. బుచ్చి బాబు రెండవ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్‌ లోనే రూపొందబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.