వైష్ణవ్‌ తేజ్ మొదటి మూడు పారితోషికాలు ఎంతో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వైష్ణవ్‌ తేజ్‌ మొదటి సినిమా ఉప్పెన సూపర్‌ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఆయన ఒక్కసారిగా యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆయన పారితోషికం కూడా అమాంతం పెరిగి పోయింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఉప్పెన సినిమాకు గాను రూ.50 లక్షల రూపాయలను వైష్ణవ్‌ కు ఇవ్వడం జరిగింది. ఉప్పెన విడుదల ఆలస్యం అవ్వడంతో ఇప్పటికే రెండు సినిమాలను కమిట్ అవ్వడం జరిగింది. రెండవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేసిన వైష్ణవ్‌ కు పారితోషికంగా రూ.75 లక్షలు దక్కింది.

ఉప్పెన విడుదలకు కొన్ని వారాల ముందు వైష్ణవ్‌ తేజ్‌ మూడవ సినిమాకు ఓకే చెప్పాడు. బోగవల్లి ప్రసాద్‌ నిర్మాణంలో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా కు ఓకే చెప్పడం జరిగింది. మూడవ సినిమాకు గాను వైష్ణవ్‌ ఏకంగా రూ.2.5 కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడు. రెండవ మరియు మూడవ సినిమా సక్సెస్ అయితే తదుపరి సినిమా కు వైష్ణవ్ రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాది వైష్ణవ్‌ మరో రెండు సినిమాలను తీసుకు వస్తాడా అనేది చూడాలి. మూడవ సినిమా దర్శకుడి విషయమై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.