వరుణ్ తేజ్ జోరు మామూలుగా లేదు

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్కి ఆశించిన ఆరంభం దొరకలేదు కానీ హీరోగా ఇప్పటికే ముద్ర వేసాడు. కంచె చిత్రంతో నటుడిగా మార్కులు కొట్టేసిన వరుణ్ ఇంకా ఫస్ట్ హిట్ కొట్టలేదు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మిస్టర్’తో ఇతను స్టార్గా సెటిల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంపై నమ్మకంతో దిల్ రాజు తన ‘ఫిదా’ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టాడు.

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఫిదా’కి రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. ‘మిస్టర్’ హిట్టయితే వరుణ్తేజ్ మార్కెట్ మారుతుంది కనుక అది రిలీజయ్యాకే ‘ఫిదా’ని వదలాలని దిల్ రాజు డిసైడయ్యాడు.

వరుసగా రెండు చిత్రాలని ఇద్దరు సక్సెస్ఫుల్ దర్శకులతో చేస్తోన్న వరుణ్ తేజ్ అప్పుడే మరో చిత్రానికీ పచ్చ జెండా ఊపేసాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ మలి చిత్రం బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

రవితేజతో కుదరాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేతులు మారింది. అందరూ టాప్ టెక్నీషియన్లనే సైన్ అప్ చేసిన నిర్మాత వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ప్రాజెక్ట్కి క్రేజ్ పెంచడానికి ఒక స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని చూస్తున్నారు.