దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతా బాగానే ఉండి ఉంటే ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యేది. కాని లాక్‌ డౌన్‌ కారణంగా మూడు నెలలుగా షూటింగ్‌ జరగడం లేదు.

ఈ సమయంలో దర్శకుడు పూరి పలు కథలను రెడీ చేశాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే వెంకటేష్‌ ను కలిసి దర్శకుడు పూరి జగన్నాధ్‌ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత చేద్దామంటూ హామీ ఇచ్చాడట. విజయ్‌ దేవరకొండతో చేస్తున్న మూవీ హిట్‌ అయినా కాకున్నా కూడా వెంటనే వెంకీ పూరిల మూవీ పట్టాలు ఎక్కేవ అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబో మూవీ చర్చలు జరిగి పట్టాలు ఎక్కే సమయంకు క్యాన్సిల్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో సెట్‌ అవ్వబోతుంది. విజయ్‌ దేవరకొండతో సూపర్‌ హిట్‌ కొడితే వెంకీ మూవీ క్రేజ్‌ అమాంతం పెరిగే అవకాశం ఉంది. కనుక పూరి ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నాడు. ఈ సినిమా ఫలితం పాజిటివ్‌గా వస్తే మహేష్‌ బాబు నుండి కూడా పూరికి పిలుపు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.