సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దగ్గుబాటి మల్టీస్టారర్?

లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు ఒక కల ఉండేది. వెంకటేష్, రానా, నాగ చైతన్యలు కలిసి నటించే సినిమాను నిర్మించాలని బలంగా కోరుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన తర్వాత పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాణ సంస్థ బాధ్యతలను పూర్తిగా టేకప్ చేసిన విషయం తెల్సిందే. ఇటీవలే ఆయన ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా అడిగే కామన్ ప్రశ్న దగ్గుబాటి మల్టీస్టారర్ ఎప్పుడు? తీరని రామానాయుడు కల ఎప్పుడు తీరుతుంది? అని.

మంచి కథ దొరికితే కలిసి నటించడానికి వారు సిద్ధంగా ఉన్నారని సురేష్ బాబు గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఈ మల్టీస్టారర్ విషయంపై ఒక అప్డేట్ ను ఇచ్చారు.

సతీష్ వేగేశ్న వచ్చి దగ్గుబాటి మల్టీస్టారర్ కోసం ఒక మంచి కథ నావద్ద ఉందని అన్నారు. మరి చూడాలి ఆయన కథ ఏ విధంగా ఉండబోతోంది. కథ నచ్చితే ఈ ముగ్గురూ కలిసి తప్పకుండా నటిస్తారు అని క్లారిటీ ఇచ్చారు.