విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ ఈ మధ్యన అజిత్ రూట్ మార్చాడు. పక్కా కమర్షియల్ చిత్రాల నుండి కొంచెం సైడ్ కు జరిగి నెర్కొండ పార్వై వంటి ప్రయోగాత్మక చిత్రాల వైపు దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో విజయ్ పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ నటించిన లాస్ట్ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్సే. దీంతో కోలీవుడ్ వరకూ విజయ్ కు తిరుగులేదు అని ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఒక నేషనల్ మీడియా విజయ్ లాస్ట్ సినిమా బిగిల్ కు 20 కోట్ల నష్టం వచ్చిందంటూ ప్రసారం చేసిన కథనం విజయ్ ఫ్యాన్స్ ను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ విషయం తమకు స్వయంగా బిగిల్ సహ నిర్మాత అర్చన కల్పతి చెప్పారంటూ ఆ మీడియా పేర్కొనడంతో అందరూ అవాక్కయ్యారు. అంత కాన్ఫిడెంట్ గా పేరు కూడా చెప్పడంతో అందరూ ఈ నష్టం వార్త నిజమేనేమో అనుకున్నారు. ఇది చాలుగా అజిత్ ఫ్యాన్స్ కు. ఇక సోషల్ మీడియాలో విజయ్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. విజయ్ ఫ్యాన్స్ ఆ కథనాన్ని డిలీట్ చేయాలనీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని పేర్కొంటూ ట్వీట్స్ చేసారు. అర్చన ఈ విషయంలో స్పందించాలని కోరారు.

చివరికి ఆమె స్పందించింది. తాను ఏ మీడియాకు ఎలాంటి నష్టం గురించి చెప్పలేదని, మీడియా సంస్థలు వార్తలు ప్రచురించేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. ఈ స్టేట్మెంట్ తో విజయ్ ఫ్యాన్స్ లో ఊపొచ్చింది. వారు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఆ జాతీయ మీడియాకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు.

Share