కేసీఆర్ వి పిచ్చి సర్వేలు..! దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో రుజువైంది అదే: విజయశాంతి

తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే సాగర్ లోనూ పునరావృతం చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలే బీజేపీలో చేరిన నటి విజయశాంతితో సాగర్ లో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఇందుకు ఆమె సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఆమెకు స్వేచ్ఛనిచ్చిందని అంటున్నారు. ఈ మేరకు ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సాగర్ లో టీఆర్ఎస్ గెలుపు సాధ్యం కాదని అన్నారు. బీజేపీ విజయం తథ్యమన్నారు. తాము గెలుస్తామని సర్వేలు చెప్పాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అవి పిచ్చి సర్వేలుగా తేల్చారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎటువంటి వ్యక్తో ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నారు.