‘కాంతార-2’ చూసాం..ఇప్పుడు చూడబోయేది ‘కాంతార-1

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ పాన్ ఇండియా లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 400 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రమిది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచనాలు నమోదు చేసిన సినిమా. కేవలం కథా బలం తో..నటీనుటల పెర్పార్మెన్స్ తోనే ఇంత పెద్ద విజయం అందుకుంది. స్టార్ అనే ఇమేజ్ తో పనిలేకుండా ప్రేక్షకులు ఆదరించిన గొప్ప చిత్రంగా నిలిచింది.

అందుకే ఇప్పుడు ‘కాంతార-2’ కూడా సిద్దమవుతుంది. కాదు కాదు ‘కాంతార-1’. అవు ను నిజం మనం ఇంతకు ముందు చూసింది ‘కాంతార-2′. త్వరలో చూడబోయేది ఆ సీనిమాకి సీక్వెల్ అయినా మొదటి భాగం అని తాజాగా రిశబ్ శెట్టి రివీల్ చేసారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 27న సినిమా ని ప్రారంభించ బోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వాస్తవానికి మీరు చూసింది పార్ -2 సినిమా. పార్ట్ -1 వచ్చే ఏడాది రాబోతుంది. కాంతార కథకి చాలా చరిత్ర ఉంది.

దాని కోసం మరిన్ని విశేషాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. పరిశోధన ఇంకా కొనసాగుతుంది. మార్చిలో ఉగాది సందర్భంగా స్టోరీ రాయడం మొదలు పెట్టాను. 2024లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలో మరిన్ని విషయాలు తెలియజేస్తాం’ అని అన్నారు. దీన్ని బట్టి ‘కాంతార’ కథకి ఇది ప్రీక్వెల్ గా కనిపిస్తుంది. ‘కాంతార’ స్టోరీ ప్రారంభోత్సవం ముందు కథని చూపించబోతున్నారని తెలుస్తుంది.

హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ‘ భూత కోల’ అనే ఓ ప్రాంతీయ నృత్యం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథకు మూలం ఆ నృత్యమే. దాని చరిత్ర ఆధారంగా కథ సిద్దం చేసారు. సప్తమీ గౌడ..కిషోర్..అచ్యుత్ కుమార్.. ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.